అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఆనందపురం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం-ఆనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేట ఎంఎల్ఎ పిఎ చంద్రశేఖర్ గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం విశాఖలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం శుభకార్యానికి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.