
విశ్రాంత ఐపిఎస్ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.వరుడు ఆస్ట్రేలియాలో ఎం ఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారంటూ నమ్మబలికి భారీగా కట్నం, బంగారం తీసుకున్నాడు.2024 అక్టోబర్ లో విశ్రాంత ఐపిఎస్ వివాహం జరిగింది.పెళ్లై రోజులు గడుస్తున్న వరుడు ఆస్ట్రేలియా కు వెళ్ళడం లేదు. ఈక్రమంలో ఎంఎస్ పూర్తి చేయలేదని తెలుసుకొని యువతి నిలదీసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










