‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ తర్వాత ఐశ్వర్య రాజేష్ తెలుగులో వరుస సినిమాలతో బిజీబిజీగా మారింది. సెప్టెంబర్‌లో సుమంత్‌తో సినిమా, డిసెంబర్‌లో నాగార్జునతో మరో సినిమా, సంక్రాంతికి రవితేజ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. అంటే నాలుగు నెలల వ్యవధిలో మూడు తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశం వచ్చింది. ముందుగా సెప్టెంబర్ 11న ‘మహేంద్రగిరి వారాహి’ వస్తోంది. సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించింది. దాని తర్వాత నాగార్జున ‘కింగ్ 100’లో కూడా ఐశ్వర్య నటిస్తోంది. ఇక మూడోది రవితేజ, హసిత్ గోలి సినిమా. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని సమాచారం. ఐశ్వర్య రాజేష్‌ను రవితేజకు జోడీగా తీసుకున్నట్లు టాక్ వస్తోంది.