తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ డిసిఎం ప్రమాదానికి గురైంది. యాపిల్ పండ్ల లోడ్‌తో వెళ్తున్న డిసిఎం వ్యాన్ మాటేడు గ్రామ స్టేజి వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో యాపిల్ పండ్లు తీసుకునేందుకు స్థానిక జనం ఎగబడ్డారు. కొందరు సంచుల్లో కిలోలకొద్దీ పండను నింపి పట్టుకెళ్లారు.