
5258 articles









హైదరాబాద్: ఐపిఎల్లో ప్రథమార్థంలో వరసగా ఆరు మ్యాచ్లో గెలిచి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ద్వితీయ ఆర్థంలో వరసగా నాలుగు మ్యాచ్లలో ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి పడిపోయింది. ఇప్పుడు ప్లే ఆఫ్స్కు చేరుకోవడం కష్టం మారింది. మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలిస్తేనే పంజాబ్ ప్లేఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్పై ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ తొలుత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోఏయి 216 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడారు. ఈ వికెట్ 210 పరుగులు చేయడం అనేది పెద్ద టార్గెట్ అని చెప్పుకొచ్చాడు. బౌన్స్లో మార్పుతో పాటు సీమ్ అవుతుండడంతో తాము 30 పరుగులు ఎక్కువ చేశామని అనిపించిందన్నాడు. పిచ్ సీమర్లకు బాగా అనుకూలించడంతో పేసర్లతోనే బౌలింగ్ చేయించానని, దీంతో చాహల్ పక్కన పెట్టానని శ్రేయస్ వివరించారు. పేస్ బౌలింగ్లో వికెట్ల రాకపోవడంతో కెప్టెన్ గా తాను విఫలమయ్యాయని తెలియజేశాడు. డెత్ ఓవర్లలో

రంగారెడ్డి: తండ్రితో కుమారుడు గొడవ పడడంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి కనిపించకపోవడంతో కుటుంబం సభ్యులు అతడిని మందలించడంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కేశంపేట మండలం కేంద్రంలో రవి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. రవికి నాని(25) అనే కుమారుడు ఉన్నాడు. 17 రోజుల క్రితం తండ్రితో రవి గొడవ పడ్డాడు. దీంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అతడి కోసం వెతికారు. తండ్రి ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రితో గొడవ పడినందుకు కుమారుడిని కుటుంబ సభ్యులు మందలించారు. తండ్రి ఆచూకీ లేకపోవడంతో తీవ్ర మనోవేధనకు కుమారుడు గురయ్యాడు. ఆదివారం బడంగ్పేట్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న వైన్ షాప్ వెనకాల నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నాని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం నానిదిగా గుర్తించారు.










నవతెలంగాణ – హైదరాబాద్ : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. రైల్వే ట్రాక్ వెంట కట్టర్లు పట్టుకుని తిరుగుతున్న కొంతమంది దుండగులను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి వారు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా.. వారు పరారయ్యారు. రైళ్లలో దోపిడీల నియంత్రణకు గస్తీ నిర్వహిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పొన్నూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. The post గుంటూరు జిల్లాలో కాల్పులు… appeared first on Navatelangana.

ఊర్కొండ కాంగ్రెస్ నాయకుల ధ్వజంభూకబ్జాలకు బీఆర్ఎస్ నాయకులు అడ్డాగా మారారువిజయ డైరీ అక్రమాలను బయటపెడతాం.. జాగ్రత్త బిడ్డ!కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆయుబ్ పాషాసర్పంచుల సంఘం అధ్యక్షుడు జరుపులావత్ రమేష్ నాయక్మన తెలంగాణ/ఊర్కొండ: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు ఊర్కొండ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బురదలో రాయి వేస్తే అది మీ మీదనే పడుతుంది.. ఎమ్మెల్యేని విమర్శించే ముందు మీ గతాన్ని, మీ స్థాయిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి" అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి. ఆయూబ్ పాషా, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జె రమేష్ నాయక్ మండిపడ్డారు.సోమవారం ఊర్కొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు బిఆర్ఎస్ పదేళ్ల వైఫల్యాలను, అక్రమాలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూకబ్జాల పర్వం - బీఆర్ఎస్ ఘనకార్యంగత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి మండలం భూకబ్జాలకు నిలయంగా మారిందని వారు ఆరోపించారు. వందల ఎకరాల ప్రభుత్వ, పేదల భూములను బిఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా కబ్జా చేసింది వాస్తవం కాదా? అని ప్రశ
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూలు జిల్లాల్లోని అక్కడక్కడా మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. The post నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు appeared first on Navatelangana.