5382 articles





అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వన్డే వార్షిక ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఇందులో 118 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానం, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఇక 102 పాయింట్లతో పాకిస్థాన్ (95)ను అధిగమించి సౌతాఫ్రికా టాప్-4లోకి వచ్చేసింది. శ్రీలంక 96 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. అఫ్గానిస్తాన్ (93), ఇంగ్లండ్ (89), బంగ్లాదేశ్ (84), వెస్టిండీస్ (74) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఐసిసి నిబంధనల ప్రకారం గత మూడేళ్లలో జరిగిన మ్యాచ్ల ఫలితాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను వెల్లడించారు. మే 2025 నుంచి జరిగిన మ్యాచ్లకు 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచ్లకు 50 శాతం పాయింట్ల వేయిటేజీని ఇచ్చారు.


అమరావతి: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మి ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఫలితంగా వారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మి వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 3.24 సెం.మి వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.





హైదరాబాద్: రుణమాఫీపై సిఎం రేవంత్ రెడ్డి పచ్చిఅబద్ధాలు చెబుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారని అన్నారు. అశోక్ నగర్ లో ధ్వంసమైన చారిత్రక మట్టికోట శివాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 800 ఏళ్ల చరిత్రను రేవంత్ కాలరాస్తున్నారని.. భయం, భక్తి లేని వ్యక్తి అని హరీష్ రావు విమర్శించారు. గుప్తనిధులు, విలువైన వస్తువుల కోసమే ఆలయం ధ్వంసం చేశారని, కాకతీయులు నిర్మించిన పురాతన ఆలయాలపై రేవంత్ కన్నేశారని ధ్వజమెత్తారు. నిజంగానే స్కూల్ నిర్మాణం కోసమైతే అర్థరాత్రి పనులు ఎందుకు? అని ప్రశ్నించారు. నిధుల కోసమే తవ్వకాలు జరపారన్న అనుమానాలున్నాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. మే 18వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేకమైన పోస్టర్ని కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కోలివుడ్ భామ శృతి హాసన్ స్పెషల్ సాంగ్లో తుళుక్కుమననుంది. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన విడుదల కానుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd pic.twitter.com/8wIgUTgGrz— PEDDI (@PeddiMovieOffl) May 11, 2026


నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ దాడుల వల్ల గడచిన 24 గంటల్లో లెబనాన్లో ఇద్దరు వైద్య సిబ్బందితో సహా 51 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇజ్రాయిల్ సైన్యం అంతర్జాతీయ చట్టాలు, మానవతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూనే ఉంది. పారామెడిక్స్పై మరిన్ని నేరాలకు పాల్పడుతోంది. బింట్ జ్బెయిల్ జిల్లాలోని ఖలావియా, టిబ్నిన్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రెండుసార్లు దాడులకు పాల్పడగా… ఈ దాడుల్లో ఇద్దరు వైద్య సిబ్బంది మృతి చెందారని ఆరోగ్య […] The post ఇజ్రాయిల్ దాడులు..లెబనాన్లో 51 మంది మృతి appeared first on Navatelangana.



పాడి రైతుల ఎదురుచూపులు నవతెలంగాణ-అచ్చంపేటపాలశీతలీకరణ కేంద్రం అచ్చంపేట పరిధిలో గల పాడి రైతులు పాల బిల్లులు రూ. 1కోటి బకాయిలు ఉన్నాయి. బిల్లుల కోసం పాడి రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.15 రోజులకు ఒక సారి బిల్లులు చెల్లించవలసి ఉండగా 45 రోజులు గడిచినప్పటికీ బిల్లు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ గ్రామాలలోని 680 మంది పాడి రైతులు ప్రతిరోజు 6500 లీటర్లు పాలను పట్టణంలోని పాలశీతలికరణ కేంద్రానికి పోస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి పాల […] The post పాల బిల్లులు రూ.1 కోటి బకాయిలు appeared first on Navatelangana.


హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. అనంతరం బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం తిరిగి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను.. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను భరణి సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. ‘‘నేను రాముణ్ని చూడలేదు. కృష్ణుణ్ని చూడలేదు. ఆది శంకరుల్ని చూడలేదు. వివేకానందుణ్ని చూడలేదు. చూడలేం కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం’’ అని భరణి పేర్కొన్నారు.
