5382 articles
నవతెలంగాణ-ఆలేరు రూరల్ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా సమ్మర్ క్యాంపులు ఉపయోగపడతాయని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ ఎర్ర లక్ష్మి సూచించారు. సోమవారం ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.వేసవి సెలవులను వృథా చేయకుండా విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకునే దిశగా శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని కోరారు.అనంతరం పీఎం శ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్ మాట్లాడుతూ ఆలేరు మండలంలోని కొలనుపాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎనిమిదో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదివే […] The post విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా సమ్మర్ క్యాంప్: ఎంఈఓ appeared first on Navatelangana.

నవతెలంగాణ – కొండాపూర్కొండాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో జనగణన (CENSUS)-2027 కార్యక్రమంలో భాగంగా మండల సూపర్వైజర్లతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ అశోక్, ASO లావణ్య, ఫీల్డ్ ట్రైనర్ ప్రవీణ్ పాల్గొని జనగణన నిర్వహణకు సంబంధించిన సూచనలు, మార్గదర్శక నియమాలను వివరించారు. జనగణన ప్రక్రియను క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు సూచించారు. The post కొండాపూర్ లో జనగణన-2027 సూపర్వైజర్ల సమావేశం appeared first on Navatelangana.
సీఐటీయూ మండల కన్వీనర్ పెరమండ్ల బాబు గడనవతెలంగాణ-నెల్లికుదురుకేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ ప్రతులను, స్థానిక అంబేద్కర్ సెంటర్ నెల్లికుదురులో దగ్ధం చేస్తున్న ట్లు సీఐటీయూ మండల కన్వీనర్ పెరుమాండ్ల బాబు గౌడ్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడు బిల్లును వ్యతిరేకిస్తూ నిజ ప్రతులను దగ్ధం చేశామని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కార్మికులు రక్త […] The post లేబర్ కోడ్ లను రద్దు చేయాల్సిందే: సీఐటీయూ appeared first on Navatelangana.


పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యం కేజీబీవీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆదర్శ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం ఎమ్మెల్యే సొంత నిధులతో మూడు లక్షలు ఆదర్శ పాఠశాలకు మంజూరు ఉపాధ్యా బృందాన్ని అభినందించిన ఎమ్మెల్యే నవతెలంగాణ-నెల్లికుదురురాష్ట్రంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యను అందించేందుకు సీఎం కృషి చేస్తున్నాడని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపన కార్యక్రమం, ఆదర్శ […] The post కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను కలిశారు. చెన్నైలోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి మర్యాదపూర్వంగా మందలించారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటొలను సోషల్ మీడియా వేదికగా సీఎం విజయ్ షేర్ చేశారు. కాగా, ఆదివారం టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం […] The post ఎంకే స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్ appeared first on Navatelangana.

హైదరాబాద్: తమతో కలిసి రావాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపును స్వాగతిస్తున్నానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని అధికారిక కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నానని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదని, అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు అభ్యంతరం లేదని రేవంత్ తెలియజేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు కేంద్రంతో కలిసి నడుస్తామని, 3ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామని తెలియజేశారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని, తమ పార్టీలు, ఐడియాలజీ వేరైనా..అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాయని అన్నారు. ఎన్నోసార్లు కలిసినా..కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని, 2 గంటలు సమమిస్తే తమ ప్రణాళికను ప్రధానికి వివరిస్తామని చెప్పారు. మెట్రో పాలిటన్ నగరాలకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఆదివారం ఐపిఎల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఉర్విల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కేవలం 13 బంతుల్లోనే అర్థ శతకం సాధించి.. ఐపిఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్థ శతకం చేసిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేశాడు. అయితే తన మెరుపు ఇన్నింగ్స్ వెనుక ధోనీ ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉందని ఈ యువ ఆటగాడు తెలిపాడు. ‘‘గత రెండు మ్యాచుల్లో నేను తొందరగా ఔటైన తర్వాత నేను డ్రెస్సింగ్ రూమ్లో మహీ భాయ్ పక్కన కూర్చున్నాను. ‘భయ్యా.. నాకు మంచి ఆరంభాలు లభిస్తున్నాయి. కానీ, నేను ఔటైపోతున్నాను. వాటిని పెద్ద స్కోర్లుగా మలచడానికి నేనేం చేయాలి?’ అని అడిగాను. దానికి మహీ భాయ్ నాతో ఒకే ఒక్క విషయం చెప్పారు. ‘నీ నైపుణ్యాల పట్ల నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఏ సందేహం ఉన్నా అది కేవలం నీ మనసులోనే ఉంది. నువ్వు మానసికంగా స్పష్టతతో ఉంటూ బంతిని సరైన ప్రదేశాలకు కొట్టడానికి ప్రయత్నించు’’ అని ధోనీ సలహా ఇచ్చాడని ఉర్విల్ పేర్కొన్నాడు.
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదు అయిన పోక్సో కేసుపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఈ మేరకు రాష్ట్ర డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసులో పక్షపాత ధోరణి లేకుండా విచారణ చేయాలని.. బాధితులకు న్యాయం జరగాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సిటీలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో […] The post బండి భగీరథ్ పోక్సో కేసు.. విచారణ కోసం ప్రత్యేక టీం appeared first on Navatelangana.


తమిళనాడు సిఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో కలిసి పని చేసిన నటీ నటులు ఆ అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ ప్రియంకా చోోప్రా విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ప్రియంకా విజయ్తో కలిసి నటించిన చిత్రం ‘తమిళన్’. ఈ సినిమా 2002లో విడుదలైంది. ఇది ప్రియాంక నటించిన తొలి చిత్రం కావడం మరో విశేషం. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనని ప్రియాంక తెలిపారు. ‘‘నా మొదటి చిత్రం ‘తమిళన్’. అప్పుడు నాకు తమిళం అసలు రాదు. డైలాగులు పేపర్పై రాసుకొని బట్టీపట్టి చెప్పేదాన్ని. అప్పటివరకూ తెర వెనుక పరిస్థితులు ఎలా ఉంటాయో.. షూటింగ్ ఎలా చేస్తారో తెలియదు. థియేటర్లో సినిమాలు చూడడం మాత్రమే తెలుసు. ఆ షూటింగ్ సమయంలో విజయ్ను చూడటానికి వందల మంది అభిమానులు వచ్చారు. సెట్స్లోకి రావడానికి పోటీపడేవారు. ఆయన డ్యాన్స్ చేస్తున్నా.. డైలాగులు చెబుతున్నా కదలకుండా చూస్తూనే ఉండేవారు. ఆయనకు ఉన్న క్రేజ్ చూసి షాక్ అయ్యాను. అంతమంది ఆయనను అలా చూస్తుంటే.. విజయ్ను అందరూ దేవుడిలా చూస్తున్నారని నాకు అనిపించింది’’ అని ప్రియాంక తెలిపారు.

హైదరాబాద్: ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని తెలంగాణలో రాజకీయ మార్పు జరగబోతుందని టిబిజెపి చీఫ్ తెలిపారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించడం, తెలంగాణను అభివృద్ధి చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పశ్చిమ బెంగాల్ లో రోహింగ్యాల ఓట్లతోనే టిఎంసి, వామపక్షాలు గెలిచాయని, ఎస్ఐఆర్ లో దొంగ నకిలీ ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని రామచందర్ రావు విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తామని అన్నారు. ఎన్నికలు లేకున్నా మోడీ సభను ప్రజలను ఆదరించారని, ఆదివారం సభకు సహకరించిన అందరికీ రామచందర్ రావు ధన్యవాదాలు తెలియజేశారు.





హుస్నాబాద్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడేలా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో సిద్దిపేట, కరీంనగర్ , హనుమకొండ ఆడిషన్ కలెక్టర్ లు, ఆర్డీవో లు , డిఎస్ఒలు, డిఎం సివిల్ సప్లయ్ అధికారులు, ఎమ్మార్వోలు, వ్యవసాయ అధికారులు ,ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంచార్జీలు, గ్రామాల వారిగా ధాన్యం కొనుగోలు కమిటీలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండడంతో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగ్స్ కొరత రాకుండా చూసుకోవాలని, సాయంకాలం వర్షాలు ధాన్యం తడవకుండా రైతులకు టార్ఫాలిన్ లు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం ఇటీవల వర్షానికి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ప్రతి గ్రామానికి వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. కొనుగోలు కేంద



