5374 articles

బిజెపి బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగం ‘మన్ కీ బాత్’ తరహాలో ఉందని తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు, ఎంఎల్సి ప్రొ. కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై స్పష్టత ఇవ్వలేదని ఆచప విమర్శించారు. సోమవారం మీడియా సమావేశంలో ప్రొ. కోదండరాం మాట్లాడుతూ జనగణనలో కులగణన, బిసిల 42 శాతం రిజర్వేషన్లపై ప్రధాని ప్రకటన చేస్తారని ఆశించామని, కాని బంగారం కొనొద్దు, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని సుభాషితాలు చెప్పిపోయారని అన్నారు. ఈ సుభాషితాలు దూరదర్శన్లో కూర్చుని కూడా చెప్పవచ్చని ఎద్దేవా చేశారు. జల విహార్లో తెలంగాణ జన సమితి 4వ ప్లీనరీ నిర్వహిస్తున్నామని కోదండరాం తెలిపారు. గత ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బిఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేశామని వివరించారు. ప్లీనరీలో గత పోరాటాలు, విజయాలను సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. కాంగ్రెస్తో కలిసి పని చేసినా తమ అస్తిత్వాన్ని కోల్పోమని కోదండరాం స్పష్టం చేశారు. అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు ప్లీనరీకి వస్తున్నారని తెలిపారు. ఈ విలేకరు


తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘జెండా పండుగ’ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల నుంచి మొదలుకొని మండల, గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగురవేసి, పార్టీ ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ మళ్లీ వంచనకు గురవుతోందని, వలస పాలన నాటి దుష్పరిణామాలను నేడు మళ్లీ ఎదుర్కొంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ రక్షణ సేన బాధ్యత తీసుకొని ఉద్యమిస్తుందని తెలిపారు.తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమిద్దాం తెలంగాణ ఏర్పడి పన్నెండున్నరేళ్లు గడిచిన సరే ఇంకా వలస పాలన నాటి దుష్పరిణామాలే ఇప్పటికీ కనిపిస్తున్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు మారుతాయని అనుకున్న ప్రతివర్గం కూడా ఇప్పడు తీవ్ర నిస్పృహలో ఉందని విచారం వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనకు అవి

మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి మేరకు దరఖాస్తు గడువు తేదీని పొడిగించామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అధికారిక వెబ్సైట్ mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-degree/ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు కోరుకున్న కోర్సులో సీటు కేటాయించడం జరుగుతుందని కార్యదర్శి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనుకుంటే గురుకుల విద్యాసంస్థల్లో చేర్చాలని, చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకుంటారని ఆయన అన్నారు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 040-23328266 లో సంప్రదించాలని కార్యదర్శి బడుగు సైదులు సూచించారు.
నవతెలంగాణ-హైదరాబాద్: యుద్ధ పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడం విడ్డూరమని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ఎద్దేవా చేసింది.ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల(అస్సాం, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్) ఎన్నికల ఫలితాలపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో(పీబీ) ఢిల్లీ పార్టీ కార్యాలయంలో రెండు రోజులు సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సమగ్రంగా అన్ని అంశాలపై సుదీర్ఘ చర్చలు సాగించి సోమవారం ప్రెస్నోట్ విడుదల చేసింది. ‘ఇరాన్పై (బ్రిక్స్ సభ్య దేశం) దాడులకు తెగబడి, ప్రస్తుత సంక్షోభానికి […] The post యుద్ధ పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని పిలుపునివ్వడం విడ్డూరం: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

మిగతా శాఖలకు పట్టింపు లేదా..నవతెలంగాణ-మద్నూర్రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం తహశీల్దార్ ఎండి ముజీబ్ అధ్యక్షతన ప్రజావాణి జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రాణి, ఏపీఎం జగదీష్ కుమార్, ఏపీవోపద్మ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అధికారులు మాత్రమే హాజరయ్యారు. మిగతా శాఖాధికారులు ఎందుకు హాజరు కావడ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ప్రజావాణికి అధికారుల డుమ్మా […] The post ప్రజావాణిలో పాల్గొనేది ఆ ఐదు శాఖలే appeared first on Navatelangana.

అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలకు మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ అధికారి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సోమవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఎసిబి అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త ఎసిబి అధికారులకు చిక్కారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఎసిబి అధికారుల కథనం ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి ప్లాట్లో గ్రామ పంచాయతీ వారు డ్రైనేజీ పైప్లైన్ వేశారు. ఆ పైప్లైన్ను అక్కడ నుంచి తొలగించాలనే అధికారిక పని కోసం పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ పది వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో అధికారులు పట్టుకున్నారు.సర్పంచ్ భర్త ద్వారా నగదు స్వీకరణసోమవారం సాయంత్రం 4.40 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు.. ఆ పది వేల రూపాయలను స్వీకరించారు. ఎసిబి అధికారులు వారిద్దరినీ పట్టుకుని, లంచం సొమ్మును స్వాధీనం చేసుకున


నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండలంలో జనగణన సర్వేలు గ్రామ గ్రామాన సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సర్వేలో ఉపాధ్యాయులు, జిపి కార్యదర్శి ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. కార్యక్రమ ప్రారంభంలో మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో చేపట్టిన సర్వేలో సర్పంచ్ మాధవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే పూర్తికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అధికారుల వెంట గ్రామ కార్యదర్శి, సర్వే అధికారులు పాల్గొన్నారు. The post జనగణన సర్వే ప్రారంభం appeared first on Navatelangana.

న్యూఢిల్లీ: గృహహింస కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త పశువులా చూడకూడదని.. ఆమెకు గౌరవంతో జీవించే హక్కు ఉందని తెలిపింది. గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. అనంతరం అతడి అభ్యర్థనను తిరస్కరించింది. నిందితుడు మద్యం మత్తులో దాడి చేశాడని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నేలపైకి తోయడంతో ఇటుక తగిలి బాధితురాలి తలకు గాయమైంది. ఆ తర్వాత కర్రతో కూడా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు నిందితుడు మూడు వివాహాలు చేసుకోగా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితురాలు మొదటి భార్య. వాదనలు విన్న న్యాయస్థానం.. ‘‘మీరు మీ భార్యను ఎందుకు కొట్టాలనుకున్నారు..? ఇలాగే వేధిస్తే.. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది. రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి’’ అంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.

నవతెలంగాణ-మద్నూర్మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ ను సర్పంచ్ మాధవరావు సోమవారం సందర్శించి, పరిశీలించారు. గత కొన్నేండ్లుగా జీపీ కార్యాలయం లేక అద్దె భవనంలో కొనసాగుతూ ఇబ్బందులు పడ్డామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో ఎట్టకేలకు భవన నిర్మాణం పూర్తైందని తెలిపారు. భవనం నాణ్యమైన మెటీరియల్ తో చాలా అందంగా ముస్తాబైందని, కొత్త శోభతో గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని అన్నారు. The post ప్రారంభోత్సవానికి సిద్ధమైన జీపీ బిల్డింగును పరిశీలించిన సర్పంచ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: వన్డే వార్షిక ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత జట్టు 118 రేటింగ్ పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్(98)ను వెనక్కి నెట్టింది. టాప్ 10 జట్ల జాబితాలో ఎలాంటి మార్పు లేదు. శ్రీలంక(96), అఫ్గానిస్థాన్(93), ఇంగ్లండ్(89), బంగ్లాదేశ్(84), వెస్టిండీస్(74) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఐర్లాండ్ 54 పాయింట్లతో […] The post ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్..టాప్లో ఇండియా appeared first on Navatelangana.

చెన్నై: తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం(మే 10) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కజగం టివికె అధినేత విజయ్.. సోమవారం ప్రతిపక్ష నేత, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన సిఎం విజయ్ కు ఉదయనిధి స్టాలిన్ స్వాగతం పలికారు. తర్వాత సిఎం విజయ్, స్టాలిన్ ఇరువురు శాలువాలతో ఒకరినొకరు సత్కరించుకున్నారు. సిఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ మర్యాదపూర్వకంగా స్టాలిన్ కు కలిసినట్లు టివికె పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టివికె 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో కాంగ్రెస్ తోపాటు చిన్న పార్టీల మద్దతు విజయ్ నేతృత్వంలోని టివికె.. తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, మొదట ఏ పార్టీ.. టివికెకు మద్దతు తెలపకపోవడంతో మూడు రోజులపాటు గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేందుకు విజయ్కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ చిన్న పార్టీలను ఒప్పించారని డిఎంకె అధికార ప్రతినిధి ఎ. సర్వణన్ తెలిపారు.





అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వన్డే వార్షిక ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఇందులో 118 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానం, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఇక 102 పాయింట్లతో పాకిస్థాన్ (95)ను అధిగమించి సౌతాఫ్రికా టాప్-4లోకి వచ్చేసింది. శ్రీలంక 96 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. అఫ్గానిస్తాన్ (93), ఇంగ్లండ్ (89), బంగ్లాదేశ్ (84), వెస్టిండీస్ (74) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఐసిసి నిబంధనల ప్రకారం గత మూడేళ్లలో జరిగిన మ్యాచ్ల ఫలితాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను వెల్లడించారు. మే 2025 నుంచి జరిగిన మ్యాచ్లకు 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచ్లకు 50 శాతం పాయింట్ల వేయిటేజీని ఇచ్చారు.


అమరావతి: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మి ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఫలితంగా వారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మి వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 3.24 సెం.మి వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.