ఏఐ ఆధారిత కోడింగ్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఓపెన్ సోర్స్ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ సూపాబేస్ భారీ ఫండింగ్ సాధించింది. సిరీస్-ఎఫ్ రౌండ్‌లో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించి, కంపెనీ విలువ 10.5 బిలియన్ డాలర్లకు చేరింది.

సీఈఓ పాల్ కాపుల్స్‌టోన్ ప్రకారం, Claude Code, Codex వంటి ఏఐ కోడింగ్ టూల్స్ వల్ల సూపాబేస్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం దాదాపు కోటి మంది డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. కొత్తగా ప్రారంభమవుతున్న డేటాబేస్‌లలో 60 శాతం కంటే ఎక్కువ ఏఐ టూల్స్ ద్వారా రూపొందుతున్నాయని కంపెనీ తెలిపింది. అలాగే భారీ స్థాయిలో Postgres డేటాబేస్‌ల నిర్వహణను సులభతరం చేసే Multigres అనే కొత్త టూల్‌ను కూడా సూపాబేస్ విడుదల చేసింది.