నేపాల్లో వరద బీభత్సం.. 1,400కి చేరువైన మృతుల సంఖ్య, 5,000 మందికి పైగా గల్లంతు!

నేపాల్ను కుదిపేసిన భారీ వరదలు, మట్టిచరియల విరిగిపడిన ఘటన మరింత విషాదాన్ని మిగుల్చుతోంది. ఆగస్టు 26న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ హిమనద సంబంధిత ఘటన అనంతరం నీరు, బురద, రాళ్లు, శిథిలాలు దిగువ ప్రాంతాలకు భారీగా కొట్టుకొచ్చాయి. దీంతో పలు గ్రామాలు, ఇళ్లు, రహదారులు, కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తాజా నివేదికల ప్రకారం ఈ విపత్తులో దాదాపు 1,380 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5,500 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
బురద, శిథిలాలు భారీగా పేరుకుపోవడంతో అనేక ప్రాంతాలకు చేరుకోవడం సహాయక బృందాలకు సవాలుగా మారింది. అయినప్పటికీ నేపాల్ సైన్యం, భద్రతా బలగాలు, సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.
వరదల కారణంగా ఇళ్లు, రహదారులు, వంతెనలు, విద్యుత్ మరియు హైడ్రోపవర్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా రవాణా మార్గాలు అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.
విపత్తు అనంతర పునరావాసం, మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం నేపాల్ అంతర్జాతీయ సహాయాన్ని కోరుతోంది. భారీ ప్రాణనష్టం, వేలాది మంది గల్లంతు కావడంతో ఈ విపత్తు హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పులు, హిమనదుల కరుగుదలతో ముడిపడిన ప్రమాదాలపై మరోసారి ఆందోళన పెంచుతోంది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













