అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు రన్నింగ్‌లో ఉండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 35 మంది ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.