సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) 10వ తరగతి సెకండ్‌ బోర్డు పరీక్షల టైం టేబుల్‌ విడుదల చేసింది. రెండవ విడత పరీక్షలు మే 15 నుంచి ప్రారంభమవుతాయి. మొదట గణితం (స్టాండర్డ్), గణితం (బేసిక్) పేపర్లు జరుగుతాయి. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతాయి. అయితే కొన్ని పేపర్లు మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి.