ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు ప్రాణాలను బలితీసుకుంది. మౌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దోరిఘాట్‌లోని బర్సాత్‌పూర్-అహిరానీ హైవేపై అతివేగంగా వెళ్తున్న ఒక స్కార్పియో వాహనం అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టి అవతలి లేన్‌లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.