Telangana School Breakfast Scheme: రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు ప్రతిరోజూ ఉచిత అల్పాహారం అందించేందుకు వారాంత బ్రేక్‌ఫాస్ట్ మెనూను విడుదల చేసింది. దోసె, ఇడ్లీ, పూరీ, పొంగల్ వంటి పోషకాహార పదార్థాలతో పాటు పాలు, రాగి జావను కూడా అందించనున్నారు..