తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు. టీటీడీ సామాన్యులకు దర్శనాలు కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తోమాల సేవ సమయంలో కూడా దర్శనాలకు సామాన్య భక్తులకు అవకాశం కల్పించనుంది. భక్తుల రద్దీని తగ్గించేందుకు, వేగంగా దర్శనాలు కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.