రన్ రాజా రన్’ చిత్రంలో బుజ్జిమా పాత్రతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల తార సీరత్ కపూర్ చిత్రపరిశ్రమలోకి వచ్చి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తయ్యాయి. కొరియోగ్రఫీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీరత్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ నోట్‌ను షేర్ చేశారు. “12 సంవత్సరాలు... లెక్కలేనన్ని పాఠాలు..అంతులేని కృతజ్ఞత. ఇప్పటికీ నేర్చుకుంటూ.. రూపాంతరం చెందుతూ నన్ను కదిలించే కథలనే ఎంచుకుంటున్నాను” అంటూ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక వేడుక కోసం సీరత్ కపూర్ చేసిన గ్లామరస్ ఫోటోషూట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.