లండన్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. దీంతో భారత పేసర్లు వికెట్లు తీసేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జాకబ్ బేతల్ అర్థ శతకం సాధించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. క్రీజ్‌లో బేతల్ (53), డకెట్ (34) ఉన్నారు.