
అమరావతి: ఆంధ్రరాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా పిల్లాపేరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీ పడిపోయింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి వంతెనపై వెళ్తుండగా వాగులో పడిపోయింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.











