
హైదరాబాద్: రాష్ట్ర సర్కార్ రైతాంగాన్ని ముప్పుతిప్పలు పెట్టి గోస పెడుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వనపర్తి లో వ్యవసాయ మార్కెట్ ను నిరంజన్ రెడ్డి పరిశీలించారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్ యార్ట్ లో రైతులకు కనీస సౌకర్యాలు లేవని, తాగునీటి వసతి లేదని.. నెలరోజులుగా ధాన్యం కొనుగోళ్లు లేవని నిరంజర్ రెడ్డి విమర్శించారు. ప్రతి గింజ కొంటామని చెబుతున్నాఆచరణలో శూన్యమని, అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలుచుని పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటి వరకు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా సేకరించలేదని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.














