
భూత్పూర్: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కోళ్ల ఫారంలో నిర్వహిస్తున్న అల్ఫ్రాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారంలో 12 మందిని అరెస్ట్ చేయగా.. మరో 23 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడిని జయప్రకాశ్ గౌడ్గా గుర్తించారు. నిందితుడు గతలో బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో అల్ఫ్రాజోలం తయారీ కేసులో అరెస్టయ్యాడు. బెయిల్పై విడుదలై స్వగ్రామంలో మళ్లీ తయారీ యూనిట్ ఏర్పాటు చేశాడు. జయప్రకాశ్పై ఈగల్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి నేడు అరెస్ట్ చేశారు.











