
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి బస్సును ఓవర్ టేక్ చేయడంతో బస్సు టైర్ వెనుక కూర్చున్న యువతి కిందపడి మృతి చెందింది. హైదరాబాద్ నుంచి జెపి దర్గాకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.











