
హైదరాబాద్: ప్రజలకు కాంగ్రెస్ పై కోపం ఉందని, బిఆర్ఎస్ పై నమ్మకం లేదని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. బిజెపిలో కీలక నేతల మధ్య విభేదాలపై అధిష్టానం దృష్టి పెట్టిందని అన్నారు. ఎంపి లక్ష్మణ్ నివాసంలో ఇరువురి నేతలతో గంటపాటు సమావేశం అయ్యారు. కేంద్రమంత్రి బండిసంజయ్, ఈటల రాజేందర్ తో అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలని బండిసంజయ్, ఈటల రాజేందర్ కు లక్ష్మణ్ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై చర్చించామని, వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, లోక్ సభ సీట్లు పెరుగుతాయని అన్నారు. బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు తామంతా కలిసి పనిచేస్తామని ఎంపి లక్ష్మణ్ తెలియజేశారు.











