
హరారే: మూడు టి-20ల సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న చివరి టి-20 మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే అభిషేక్ శర్మ(2) ఔట్ అయ్యాడు. అయితే వైభవ్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 49 బంతులు ఎదురుకున్న వైభవ్.. 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 81 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు చేయగా.. ఆఖర్లో రింకు సింగ్ దూకుడుగా ఆడాడు 14 బంతులు ఎదురుకొని 2 ఫోర్లు 1 సిక్సుతో 25 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలింగ్లో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు, సికందర్, బ్రెస్సింగ్, వెస్లీ తలో వికెట్ తీశారు.











