హైదరాబాద్: యువతను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. కరీంనగర్ లో కెటిఆర్ కు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను బిఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు? అని బిఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని.. చేస్తాం అని తెలియజేశారు. బిఆర్ఎస్ లాగా నిరుద్యోగ యువతతో తాము ఆటలు ఆడలేదని, నిరుద్యోగులకు కెటిఆర్ క్షమాపణ చెప్పాలని శ్రీధర్ బాబు సూచించారు.