ఢిల్లీ: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. హార్టికల్చర్ పై దేశవ్యాప్తంగా ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననంపై, ఆన్ లైన్ మోసాలను అరికట్టడంపై చర్చ జరగాలని, చట్టం తేవాలని, మ్యూల్ ఖాతాలు, ఆన్ లైన్ మోసాలను అరికట్టడంపై జరగాలని కోరారు. షెల్ కంపెనీలు, హవాలా లావాదేవీలద్వారా దేశానికి తీవ్ర నష్టం జరిగిందని ఎంపి లావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరిగతిన జరుగుతున్నాయని, గోదావరి- పెన్నా నదులను అనుసంధానించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాలని, మహిళా బిల్లుకు విపక్షాలు సహకరించాలని ఎంపి లావు కృష్ణదేవరాయులు కోరారు.