నవతెలంగాణ – హైదరాబాద్ : ధర్మశాల వేదికగా సోమవారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుతుంది. ఢిల్లీ ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. 11 మ్యాచ్‌ల్లో నాలుగే గెలిచిన DC మిగిలిన మూడు మ్యాచ్‌లను తప్పక గెలవాలి. ఇరు జట్లు ఇప్పటివరకు 36 సార్లు తలపడగా, DC 17, పంజాబ్ కింగ్స్ 18 విజయాలు సాధించాయి.

The post IPL-2026: నేడు పంజాబ్, ఢిల్లీ మధ్య కీలక మ్యాచ్ appeared first on Navatelangana.