హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఒకే రోజు నలుగురు రైతులు చనిపోయారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదు కానీ గన్స్ దొరుకుతున్నాయని, డబ్బుల సంచులపై ఉన్న శ్రద్ధ ధాన్యం సంచులపై లేదని విమర్శించారు. భూదోపిడీపై పెట్టే శ్రద్ధ రైతులపై లేదని, రెండున్నర ఏళ్లయినా ఇంకా తమపైనే ఏడుస్తున్నారని మండిపడ్డారు. రేపటి కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కెటిఆర్ కోరారు. రేపు ప్రభుత్వ స్పందన చూసి కార్యాచరణ ప్రకటిస్తామని, బాలిక పేరెంట్స్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ధ్వజమెత్తారు. 9 రోజులు రాచమర్యాదలు చేసిందెవరు? అని ప్రశ్నించారు. ఎవరైనా దొరికితే కేసు పెట్టు అని ఆ బాలిక వివరాలు బయటపెట్టిన వారిపై కేసు పెట్టాలని సూచించారు. కేంద్రమంత్రి కొడుకు అయితే ఏమైనా మినహాయింపు ఉంటుందా? అని కెటిఆర్ ప్రశ్నించారు.