తిరువనంతపురం: బస్సు అదుపుతప్పి కారుపై బోల్తాపడడంతో ఒకరు మృతి చెందిన సంఘటన కేరళ రాష్ట్రం మలప్పురం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కుట్టిప్పురం జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు అదుపుతప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు పెరూవయాల్ ప్రాంతానికి చెందిన వైశాగా గుర్తించారు. బస్సు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టిన అనంతరం కారు పడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.