
తెలంగాణ మట్టి వాసనలతో సంచలనమైన జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు హీరోగా సినిమా ప్రారంభమైంది. యం.యస్ వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నం 3గా ముని శివ, శివమల్లాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దిలీప్ సాయి నాయక్. శివమ్ మీడియా కార్యాలయంలో ఈ చిత్రం వైభవంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, ఆర్.పి పట్నాయక్, సతీష్ వేగేశ్న, విజయ్ రెడ్డి వెన్నం హాజరయ్యారు. దర్శకుడు దిలీప్కి స్క్రిప్ట్ని సతీష్ వేగేశ్న, బుల్లెట్బండి లక్ష్మణ్ అందించగా హీరో కిట్టుపై చంద్రబోస్ క్లాప్ నిచ్చారు. ఆర్ పి పట్నాయక్ తొలిషాట్కి గౌరవ దర్శకత్వం వహించగా విజయ్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసి టీమ్కి అభినందనలు తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ- ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మదిన్, జనతా బబ్లూ పాల్గొన్నారు.











