టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రికార్డు సృష్టించింది. అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువ దాదాపు 450 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39 లక్షల కోట్లు) పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏదేనీ నమోదిత కంపెనీ కూడా ఒక్క రోజు ఇంత భారీ స్థాయిలో మార్కెట్ విలువను పెంచుకోలేదు. ఈ సంచలన ర్యాలీతో మైక్రోసాఫ్ట్, ప్రముఖ ఏఐ చిప్‌మేకర్ ‘ఎన్విడియా’ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మళ్లీ తన స్థానాన్ని చేజిక్కించుకుంది. త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత మైక్రోసాఫ్ట్ షేర్లు ఒక్కసారిగా 9 శాతం పెరిగాయి. ఫలితంగా ఒక్క రోజులోనే పొందిన ఈ అదనపు మార్కెట్ విలువ, దక్షిణాఫ్రికా, వియత్నాం, టర్కీ వంటి దేశాల మొత్తం స్టాక్ మార్కెట్ విలువల కంటే చాలా పెద్దది చెప్పుకోదగ్గ విషయం.