హైదరాబాద్: బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని అన్నారు. అమెరికాలో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉందని, ఫార్మాసిటీని కొనసాగిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని తెలియజేశారు. రేవంత్ ప్రభుత్వం కేవలం జిమ్మిక్కు చేస్తోందని, ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. 75 శాతం ఫార్మాసిటీ 25 శాతం మిగతావి ఉండాలని చూశామని, ఈ సర్కార్ 75 శాతం వ్యాపారం, 25 శాతమే ఫార్మా ఉండేలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రభుత్వంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం..ఫార్మా సిటీని రీసోర్ట్ చేస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. ఫార్మాసిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు ప్రారంభించామని, ఈ ప్రభుత్వం ఏం చేసినా నడవదని.. కోర్టులో నిలబడదని హరీష్ రావు అన్నారు.