
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని చూసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదని బిజెపి ఎంపి డికె అరుణ తెలిపారు. జాతి వ్యతిరేకత శక్తులు ఉద్యమంలో ఉన్నాయని అన్నారు. మోడీని, దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అప్ కోసం పనిచేసే వ్యక్తి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. బిఆర్ఎస్ హయాంలో గ్రూప్1 పేపర్ లీక్ అయితే..అప్పుడెందుకు రాజీనామా చేయలేదు? అని డికె అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో టెన్త్ పేపర్ లీక్ అయితే ..ఇక్కడెవరూ రాజీనామా చేయలేదని, ప్రధాని మోడీని అపహాస్యం చేసేందుకు యువతను ఉసిగొల్పారని మండిపడ్డారు. ఇవి మీడియాను తన వైపు తిప్పుకోవడానికి సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామాలని, సిఎం పదవి కాపాడుకోవాలి..రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టాలని డికె అరుణ ఎద్దేవా చేశారు. ప్రధానిని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని..మోడీది కాదని డికె అరుణ చురకలంటించారు.











