హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. అనంతరం బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం తిరిగి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను.. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను భరణి సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘‘నేను రాముణ్ని చూడలేదు. కృష్ణుణ్ని చూడలేదు. ఆది శంకరుల్ని చూడలేదు. వివేకానందుణ్ని చూడలేదు. చూడలేం కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం’’ అని భరణి పేర్కొన్నారు.