ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ పై చర్చ విషయమై కాంగ్రెస్ సహా విపక్షాలతో మాట్లాడామని బిజెపి నేత కిరణ్ రిజిజు తెలిపారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ఇవాళ చర్చ జరుపుదామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్ష సభ్యుల షరతులు విధించడం మొదలు పెట్టారని, యువత భవిష్యత్తు విషయంలో రాజీపడేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పారని కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర ఏజెన్సీ పేపర్ లీక్ సహా ఎన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయ్యాయనే దానిపై చర్చిద్దామని, నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని, నీట్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దు అని కిరణ్ రిజిజు కోరారు.