
హైదరాబాద్: నేతలందరూ వారి నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. సర్ ప్రక్రియ చాలా కీలకమైనదని..నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. జూమ్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియపైనే దృష్టి పెట్టాలని, సర్ ప్రక్రియపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు సర్ ప్రక్రియ పనులు వేగవంతం చేయాలని, దేశంలో సర్ వల్ల జరిగిన నష్టాలు గుర్తించి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోవద్దు అని మహేష్ గౌడ్ సూచించారు.











