
లక్నో: నిక్కర్లో విద్యార్థి మూత్రం పోసుకున్నాడని బాలుడి మర్మాంగంపై చాకును కాల్చి వాత పెట్టిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ప్రైవేటు ప్లే స్కూల్లో కేసరి జయస్వాల్ అనే విద్యార్థి చదువుతున్నాడు. శుక్రవారం స్కూల్కు వెళ్లి వచ్చిన తరువాత మర్మాంగం వద్ద నొప్పిగా ఉందని తల్లికి చూపించాడు. వాతలు కనిపించడంతో స్కూల్కు వెళ్లి ప్రిన్సిపాల్ను అడగడంతో వారు పట్టించుకోలేదు. బాబు వాష్రూమ్కు వెళ్తానని టీచర్ను అడిగాడు. ఆమె పట్టించుకోకపోవడంతో నిక్కర్లో మూత్రం పోసుకున్నాడు. టీచర్ ఆగ్రహంతో బాబు పక్క రూమ్కు తీసుకెళ్లి చాకు కాల్చి వాతలు పెట్టింది. దీంతో బాబు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ టీచర్తో పాటు ప్రిన్సిపాల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.











