హైదరాబాద్: విభిన్నమైన, విలక్షణమైన సినిమాలు తీయడంలో నటుడు అడివి శేష్ ముందుంటాడు. అందుకే ఆయన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఇక శేష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. శేష్ గత సినిమాకు భిన్నంగా ఈ సినిమాని రొమాంటిక్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కించారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్. షానియోల్ డియో దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దర్శకుడితో పాటు శేష్, స్క్రీన్‌ ప్లే రాయడం విశేషం. ఇక ఈ సినిమా ఒటిటిలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి మీరు ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను థియేటర్‌లో మిస్ అయి ఉంటే మే 8వ తేదీన బుల్లితెరపై చూసేయండి.