
హైదరాబాద్: పథకం ప్రకారమే ఈ దొంగతనం జరిగిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సమాచారం తెలియగానే తాను ఇక్కడికు వచ్చానని అన్నారు. కరీంనగర్ పిఎంజె షాపులో కాల్పుల కలకలం రేపిన ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చోరీ ఘటనపై సిపి గౌస్ ఆలంను అడిగి తెలుసుకుంటున్నామని, పోలీసులు విచారణ ప్రారంభించారని తెలియజేశారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారని, కొందరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారని అన్నారు. నిందితులు తెలుగు, హిందీ మాట్లాడుతున్నట్టు తెలిసిందని, మొత్తం ఐదుగురు వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు. క్లూస్ టీమ్ వివరాలు తీసుకుంటున్నారని, నిందితులను తప్పకుండా పట్టుకుంటారన్ననమ్మకం తనకు ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.











