అమరావతి: సర్ పై వైసిపి కోర్టుకు వెళ్లిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. స్థానిక ఎన్నికలు జరగడం మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికు ఇష్టం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికలు జాప్యం జరిగేకొద్దీ.. అధికార పార్టీకి నష్టం కలుగుతుందని జగన్ ఆశ అని.. జగన్ ది దింపుడు కళ్లెం ఆశ అని చంద్రబాబు విమర్శించారు. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితేనే.. రాజకీయ స్థిరత్వానికి నాంది పలికినట్లు అని చంద్రబాబు పేర్కొన్నారు. బిసిలకు 34%రిజర్వేషన్లు అనేది చట్టపరమైన రక్షణ మాత్రమేనని, ప్రతి ఎన్నికల్లోనూ బిసిలకు టిడిపి ప్రాధాన్యం ఇస్తూనే ఉందని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను సిఇసి ఎప్పుడైనా ప్రకటించవచ్చునని చంద్రబాబు నాయుడు సూచించారు.