
పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్.. బిజెపి, సిఎం మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి)ని చిత్తుగా ఓడించింది. మొత్తం 294 స్థానాలకు 206 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉండగా.. టిఎంసి కేవలం 81 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. దీంతో తొలిసారి బెంగాల్ లో కషాయ జెండా ఎగరనుంది. ఇక, అస్సాంలో బిజెపి 126 అసెంబ్లీ స్థానాలకు గానూ 102 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.












