హైదరాబాద్: కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. హైదరాబాద్‌ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను కలిసి.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్‌కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన నిపుణులు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ కుడి భుజానికి సర్జరీ చేసింది.