హైదరాబాద్: తమ పదవులకు ఎసరొస్తుందని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ భయపడుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. పచ్చ కాంగ్రెస్ పెత్తనం పెరుగుతుందని అచ్చ కాంగ్రెస్ కు భయం అవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే వాళ్లు ధర్నాలు చేస్తున్నారని, అంతర్గత సంక్షేభం నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ ధర్నా డ్రామా అని జగదీష్ రెడ్డి విమర్శించారు. కొండా సురేఖతో మొదలైన సంక్షేభం కొనసాగుతుందని తెలియజేశారు. హామీలు నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, సమయానికి నరసింహస్వామి ఏం చేశారో మాజీ సిఎం కెసిఆర్ అలా చేస్తారని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.