
హైదరాబాద్: జింబాబ్వేతో జరిగిన మూడో టి20లో గెలిచి టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్లలో వైభవ్ సూర్యవంశీ 196 స్ట్రైక్రేటుతో 151 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. మూడు మ్యాచ్లలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ టూర్లో వైభవ్ ఐదు రికార్డులు బద్దలు కొట్టాడు. 16 ఏళ్ల వయసు రాకముందే రెండు హాఫ్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. మూడు మ్యాచ్లలో 196 స్ట్రైక్ రేటుతో 151 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ఆటగాడిగా చరిత్రలోకెక్కాడు. భారత జట్టు తరపున అత్యంత తక్కువ వయసులో హాఫ్ సెంచరీ చేయడంతో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. 15 ఏళ్ల 118 రోజు వయసులోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. గతంలో నేపాల్కు చెందిన కుశాల్ మల్లా పేరిట ఉండేది.











