
హైదరాబాద్: మధురానగర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచ్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బాలుడు కారుతో ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందింది. మధురానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.











