
అమరావతి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో లారీ బీభత్సం చేసింది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న కూలీల్ని లారీ ఢీకొంది. లారీ ఢీకొట్టడంతో కూలీలు ఎగిరిపడ్డారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.












