తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి శిలాతోరణం వరకు క్యూలైన్ లో భక్కులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 77,874 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు, శ్రీవారికి తలనీలాలు 35,302 మంది భక్తులు సమర్పించినట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.