న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి వినీశ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన వినీశ్‌ను ఓయూ సిబ్బంది గాంధీ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

The post ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్ appeared first on Navatelangana.