ఢిల్లీ: ఢిల్లీ పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని సిజెపి నేత తెలిపారు. ప్రతి జిల్లా, గ్రామంలో శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చామని అన్నారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద సిజెపి నేతలు మీడియాతో మట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయని, కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిన మద్దతును ఎప్పటికీ మరచిపోమని తెలియజేశారు. తమ మద్దతు వల్లే నెలన్నరగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయని, వారికి ఆందోళనకారుల నేపథ్యం ఏమీ లేదని అన్నారు. ఇప్పుడు మౌనం వహిస్తే దేశం ఎప్పుడూ ముందుకు సాగదని, ఈ వ్యక్తులకు భయపడి ప్రశ్నించకపోతే భవిష్యత్తు ఉండదని సిజెపి పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్ అని ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతాయని సూచించారు. కేంద్రంతో చర్చలు తటస్థ వేదికపైనే జరుగుతాయని, ఆందోళన ఆపమని చెప్పడం కాదు..సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దనేదే తమ ప్రధాన ఉద్దేశం అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సిజెపి నేతలు కోరారు.