హైదరాబాద్: తమతో కలిసి రావాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపును స్వాగతిస్తున్నానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని అధికారిక కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నానని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదని, అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు అభ్యంతరం లేదని రేవంత్ తెలియజేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు కేంద్రంతో కలిసి నడుస్తామని, 3ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామని తెలియజేశారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని, తమ పార్టీలు, ఐడియాలజీ వేరైనా..అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాయని అన్నారు. ఎన్నోసార్లు కలిసినా..కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని, 2 గంటలు సమమిస్తే తమ ప్రణాళికను ప్రధానికి వివరిస్తామని చెప్పారు. మెట్రో పాలిటన్ నగరాలకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.