
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల రాక్షసుడిగా మారిపోయారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతుబంధు బంద్ అయ్యింది, సాగుకు కరెంట్ ఇవ్వట్లేదని అన్నారు. సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూరియా లేదు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదని విమర్శించారు. మున్ముందు మరింత కరువు వస్తుందని హరీష్ రావు సూచించారు. గోదావరిలో వరద పోతుంటే నీళ్లు ఎత్తిపోయట్లేదని, స్కామ్ ల కాంగ్రెస్ పోయి..స్కీముల మాజీ సిఎం కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. రేవంత్ రెడ్డి వచ్చి మళ్లీ పాతరోజులు తీసుకువచ్చారని, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయమంటే.. భద్రాచలం మునుగుతుందని అంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు.











